Telangana Legislative Council: తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో గుత్తా ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.
Telangana Legislative Council: గుత్తాకు మంత్రుల అభినందనలు
రెండవ సారి మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. గ్రామ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. అనేక పదవులను అలంకరించినా ఆయన సామాన్య వ్యక్తిగానే ఉన్నారని తెలిపారు. మండలి చైర్మన్ గా గుత్తా విజయవంతం అయ్యారని పేర్కొన్నారు.
ఈ సందర్భంలో రెండవ సారి మండలి చైర్మన్ గా అవకాశమిచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ కు సుఖేదర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మండలి చైర్మన్ గా తాను ఎకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.