Breaking: సూర్యపేట మైహోమ్స్ సిమెంట్స్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. యూనిట్ – 4 ప్లాంట్ లో లిప్ట్ కూలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తొంది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా, లిప్ట్ జారి కిందపడి కాంట్రాక్ట్ కార్మికులు మృత్యువాత పడ్డారు.
మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులుగా గుర్తించారు. యాజమాన్యం సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.