TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ శనివారం నుండి జరగనున్నాయి. శాసనభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ తో రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు.
ఆ తర్వాత నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్ బాధ్యతలను అక్బరుద్దీన్ ఒవైసీ నిర్వహించనున్నారు. సాధారణంగా ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు.
అసెంబ్లీలో సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసిఆర్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికైయ్యారు. కానీ ఆయన కాలు ఫ్యాక్చర్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ అయిదు సార్లు శాసనసభకు ఎన్నికైన వారిగా ఉన్నారు. కాంగ్రెస్ లో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా.. వీరు ఇద్దరూ మంత్రులుగా నియమితులైయ్యారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారు.
CM Revanth Reddy: సీఎం హోదాలో మొదటి సారి హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి ..ఎందుకంటే..?