అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమైయ్యాయి. మహాకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.
అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ .. వందల ఏళ్లుగా బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోందని, కేలలం హైదరాబాద్, సికింద్రాబాద్ ల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎలాంటి పకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే దేశ మంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
బోనాల జాతరను పురస్కరించుకుని భారీ ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. వేకువ జాము నుండే బోనాల సమర్పణ ప్రారంభమైంది. సాధారణ భక్తులు, వీఐపీల వేరువేరుగా క్యూలైన్ లు అందుబాటులోకి తీసుకువచ్చారు. దాతల పాస్ ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్ ను కూడా ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా రేపు (10వ తేదీ) వరకూ హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
CI Swarnalatha: ఇన్స్పెక్టర్ స్వర్ణలతకు బిగ్ షాక్