ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా విదేశాల నుండి బంగారం స్మగ్లింగ్ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశం వ్యాప్తంగా ఏదో ఒక ఎయిర్ పోర్టులో తనిఖీల్లో అక్రమ మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా దుబాయ్ నుండి శంషాబాద్ వచ్చిన నలుగురు మహిళల నుండి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. 3,175 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారాన్ని క్యాప్సుల్ లో నింపి మహిళలు తమ కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేయగా, అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ లో బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.2కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో నిన్ననే దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి రూ.66 లక్షల విలువైన వెయ్యి గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తెల్లవారుజామున వచ్చిన ఓ ప్రయాణీకుడి నుండి రూ.52,24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణీకుడి నుండి రూ.14,23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు .. నిందితుల ఉరి శిక్ష రద్దు.. నిర్దోషులుగా విడుదల..