తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకై ఆ పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ తో రెండు సార్లు టీఆర్ఎస్ కే పట్టం గట్టారు. రాబోయే ఎన్నికల్లో అయినా పూర్వ వైభవం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అడుగులు వేస్తొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది అనుకుంటున్న తరుణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంతో రాజశేఖరరెడ్డి అభిమానుల్లో కొందరు ఆ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. షర్మిల ఏదో ఒక ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మరో పక్క పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ మూలంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో నష్టం జరుగుతుంది. దాన్ని నివారించుకోవాలంటే ఏమి చేయాలి అనే అంశాలపైనా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తొంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్శింహ, మధుయాష్కి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు శుక్రవారం రాాత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో షర్మిల పార్టీ పై చర్చ జరిగినట్లు సమాచారం. షర్మిల పార్టీ మూలంగా కాంగ్రెస్ బలంగా ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారుట. దీనిపై వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తొంది. వైఎస్ఆర్ ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలంటే ఏమి చేయాలని అనే దానిపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హజరుకాలేదు. దీంతో మాణిక్యం ఠాగూర్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది. మరో పక్క గాంధీ భవన్ లో మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం రైతు రచ్చబండ కార్యక్రమంపై జిల్లా పార్టీ అధ్యక్షులతో రివ్యూ నిర్వహించారు.
బ్రేకింగ్.. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా