Madhuranagarilo December 06 2023 Episode 228: ఏంటండీ ఇంత లేట్ అయింది అమ్మాయి ఇంకా రాలేదు అని నాగమణి అంటుంది. అర్జెంటు పని ఉండి అల్లుడు గారి దగ్గర ఉండిపోయింది ఏమో అని మురళి అంటాడు. ఉండిపోయిందో అల్లుడుతో గొడవ పడుతుందో అని నాగమణి అంటూ ఉండగా రుక్మిణి వస్తుంది. నువ్వు ఊహించింది నిజమే అమ్మ కానీ నేను గొడవ పడుతున్నది మీ అల్లుడు గారితో కాదు నాకు నేనే గొడవ పడుతున్నాను అని రుక్మిణి అంటుంది. ఏమైందమ్మా ఇంత లేటుగా వచ్చావు అని నాగమణి అడుగుతుంది. నా భర్త రెండో భార్యను తీసుకుని సినిమాకు వెళ్దాం అనుకున్నాడు కానీ నేను ఆయనని సినిమాకు వెళ్ళనీయకుండా నా దగ్గరే కూర్చో పెట్టుకున్నాను అని రుక్మిణి అంటుంది. దాంట్లో తప్పేముందమ్మ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా సినిమాకి వెళ్తారు ఇంకా ఎక్కడికైనా వెళ్తారు అని నాగమణి అంటుంది.
అది కాదమ్మా భార్య నేను భార్యని నా భర్త వెళ్తే సినిమాకి నాతోనే వెళ్లాలి ఇంకెవరితో వెళ్లినా నేను ఒప్పుకోను, అలా చేసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది నా భర్త మీద కోపంతో తన రెండో భార్యని ఇబ్బంది పెడుతున్న నేమో అనిపించింది ఇలా రకరకాలుగా అనిపించినా చివరికి నేను చేసింది కరెక్ట్ అనిపిస్తుంది అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఈ కొత్త వంటవాడు ఎవడు రాదా అని మధుర అడుగుతుంది మధుర. ఎవడో కాదు ఈ ఇంటి వాడే అని శ్యామ్ అంటాడు. తనని ఆ అవతారంలో చూసి అందరూ నోరెళ్లబెడతారు. ఏంటండీ ఈ అవతారం అని రాధా అంటుంది. వంటవాడి అవతారం రాదా అని శ్యామ్ అంటాడు. అర్థమైంది రా నువ్వు ఈ అవతారం ఎందుకు ఎత్తావో నిన్న పండుని రాదని సినిమాకు తీసుకువెళ్ల లేదు కదా అందుకని ఈరోజు వంట చేసి పెట్టి పండుని ఇంప్రెస్ చేదాం అనుకుంటున్నావు కదా అని మధుర అంటుంది. బాగా క్యాచ్ చేశావమ్మా రేయ్ పండు ఈరోజు నీకు వేడివేడిగా దోసెలు వేసి పెడతాను ఇలా వచ్చి కూర్చోరా అని శ్యామ్ అంటాడు. దోశలు వాడికొక్కడికేనా మాకు లేవా అని రాదా అడుగుతుంది. అందరికీ వేసి పెట్టాను తీసుకొస్తాను తినండి అని దోసెలు తెచ్చి వాళ్లకు వేస్తాడు. అందరూ దోశ నోట్ల పెట్టుకొని నమలకుండా అలాగే చూస్తారు.ఈ ఎవ్వరo బెడిసి కొట్టినట్టు ఉంది అని శ్యామ్ కొంచెం పక్కకు జరుగుతాడు. డాడీ దోసెలు సూపర్ గా ఉన్నాయి ఇలాంటి దోశలు ఎప్పుడు తినలేదు డాడీ అని పండు అంటాడు.
అంటే ఏంట్రా మాకు దోసెలు వెయ్యడం రాదని అంటున్నావా అని రాదా అంటుంది. అవును మీరు డాడీ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అని పండు అంటాడు.మీ డాడీ ఒక్కరోజు దోసెలు వేయగానే మాస్టర్ అయిపోయాడ రా మమ్మల్ని నేర్చుకోమంటున్నావ్ అని మధుర అంటుంది.మనకు రాణి విద్యా ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు మధుర దాంట్లో తప్పేముంది అని ధనంజయ్ అంటాడు. అంటే ఏంటండి మీరు కూడా మాకు వంట రాదని అంటున్నారా ఎంతైనా మీ మగవాళ్ళు బుద్ధి చూపించారు అని మధుర అంటుంది. మగవాళ్ళ మొగవాళ్ళం ఒక జట్టు అని పండు అంటాడు. పెద్ద దిగొచ్చాడండి మొగాడు అని మధుర అంటుంది. పెద్దవాడిని చిన్నవాడిని అయినా మగవాడినే కదా అని పండు అంటాడు. రేయ్ శ్యామ్ మీ డాడీ కి ఇంకో దోసె అంట అని మధుర అంటుంది. లంచ్ బాక్స్ కట్టాలమ్మా స్కూల్ కి లేట్ అవుతుంది అని శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే పండు రాధా శ్యామ్ స్కూల్ దగ్గరికి బయలుదేరుతారు. దారిలో ఐస్ క్రీం కనపడగానే డాడీ ఐస్ క్రీమ్ కావాలి అంటాడు పండు. సరే కొనిస్తాను అని కారు పక్కకు ఆపగానే పండు పరిగెత్తుకెళ్తాడు. అటు నుంచి స్కూటీ వస్తు గుద్ధ పోతే ఒక అమ్మాయి కాపాడుతుంది. అయ్యో నీకు బాగా దెబ్బలు తగిలాయ అమ్మ అని శ్యామ్ అంటాడు.
ఏం పర్వాలేదండి చిన్న దెబ్బగా తగ్గిపోతుందిలే అని ఆ అమ్మాయి అంటుంది. చిన్న దెబ్బ ఏంటమ్మా రక్తం కారుతుంది పద హాస్పిటల్ తీసుకెళ్తాను అని రాధా తీసుకువెళ్తుంది హాస్పిటల్కి. కట్ చేస్తే, రేయ్ శ్యామ్ పండుకి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కదా అని మధుర అంటుంది. ఏం కాలేదమ్మా కానీ పాపం ఒక అమ్మాయి సమయానికి వచ్చి పండుని కాపాడింది లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది అని శ్యామ్ అంటాడు. ఎవర్రా ఆ అమ్మాయి అని ధనంజయ్ అంటాడు. అదిగో అమ్మాయి అని తనను చూపెడుతుంది రాదా. ఆ అమ్మాయిని చూడగానే ధనుంజయ్ షాక్ అవుతాడు. మా పండుని కాపాడి మాకు మేలు చేశావమ్మా నీ రుణం తీర్చుకోలేము అని మధుర అంటుంది .
నేను చేసింది చిన్న సహాయం మాoడి ఎందుకు అంత పెద్ద మాటలు అని ఆ అమ్మాయి అంటుంది. ధనంజయ్ ఆ అమ్మాయి ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ నిలబడతారు. ఏమండీ మీకు ఇద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అలా చూసుకుంటున్నారేంటి అని అడుగుతుంది మధుర. మొన్న ఏదో పరిజ్ఞానంలో నడుచుకుంటూ సార్ గారికి అడ్డంపడ్డాను మేడం అప్పటినుంచి ఈ సార్ కి నాకు పరిచయం అని అమ్మాయి అంటుంది.
అవునా ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా దెబ్బలు ఏమి ఎక్కువ తాగలేదు కదా అని మధుర అడుగుతుంది. పరవాలేదండి రెండు రోజులు టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతాయి అని డాక్టర్ చెప్పింది అని అమ్మాయి అంటుంది ధనంజయ్ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే, ఇంకా ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలి మమ్మీ నాకు వేసుకో బుద్ధి కావట్లేదు అని పండు అంటాడు. ఇంకా రెండు టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది నాన్న స్కూల్ కి తొందరగా వెళ్లొచ్చు అని రాదా అంటుంది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది రాదా లేకుంటే ఈపాటికి ఘోరం జరిగిపోయేది ఆ అమ్మాయి ఎవరో దేవతల వచ్చి కాపాడింది అని మధుర అంటుంది. ఇంతలో రుక్మిణి రాధా కి వీడియో కాల్ చేస్తుంది. పండు ఫోన్ ఎత్తి హాయ్ పెద్దమ్మ అని అంటాడు. ఫోన్లో తన మొహాన్ని చూసి షాక్ అవుతుంది రుక్మిణి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!