Balakrishna: తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధికంగా స్పీడ్ గా సినిమాలు చేస్తున్న హీరోలు సీనియర్లే. కరోనా తర్వాత చిరంజీవి, బాలకృష్ణ అత్యధికంగా సినిమాలు చేయడం జరిగింది. 2021 లో బాలయ్య బాబు అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సమయంలో వైరస్ ప్రభావం ఉన్న గాని సినిమాపై నమ్మకంతో థియేటర్లో విడుదల చేసి… కెరియర్ లోనే అతిపెద్ద హీట్ అందుకోవటం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడాది గ్యాప్ ఇచ్చి ఆ సమయంలో ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” షో షో చేయడం జరిగింది. ఈ షోలో ఫస్ట్ టైం బాలకృష్ణ యాంకర్ గా చేసి అందరినీ మెప్పించారు. మొదటి సీజన్ లో సినిమా హీరోలతో రెండవ సీజన్లు సినిమా హీరోలతో పాటు రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసి షో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” దసరా పండుగకు “భగవంత్ కేసరి” సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవడం జరిగింది. కాగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సితార బ్యానర్ లో ఎంతవరకు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలలో ఇది ఒకటి. కథ ఈ సినిమాలలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్టోరీ ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ మూడు దశలలో జర్నీ కొనసాగుతుందని.. ఈ క్రమంలో మూడు కాలాలను టచ్ చేస్తూ.. స్క్రిప్టు సిద్ధం చేసినట్లు సమాచారం.
దీంతో ఒకో కాలంలో బాలయ్య తన జీవితంలో ఒకో దశలో ఒకో హీరోయిన్ తో… ట్రాక్ నడుపుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఊర్వశి రౌతులే.. మీనాక్షి చౌదరిని ఎంపిక చేయటం జరిగింది. అంతేకాకుండా ఇద్దరు హీరోయిన్లతో లాంగ్ షెడ్యూల్లో.. బాలయ్య నటిస్తున్నట్లు టాక్. ఈ క్రమంలో మరో మూడో హీరోయిన్ కోసం వెతికే పనిలో సినిమా మేకర్ నిమగ్నమైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ మూడో హీరోయిన్ యే సినిమాకి మెయిన్ హీరోయిన్ అని అంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఓ ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ నీ తీసుకునే ఆలోచనలో సినిమా ఏ రేటు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!