తెలంగాణ లో కరోనా భీభత్సానికి అసలు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా… 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా ఎప్పటి లాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 329 కేసులు బయటపడగా…. ఈ సారి రంగా రెడ్డి జిల్లాలో కూడా వైరస్ సుడిగాలిలా వ్యాపించింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా రంగారెడ్డిలో 129 కేసులు నమోదయ్యాయి.
ఇకపోతే మిగిలిన కేసుల్లో మేడ్చల్ 4, మంచిర్యాల 4, సంగారెడ్డి 1, మహబూబ్ నగర్ 6, ఖమ్మం 2, సూర్యాపేట 2, నల్గొండ 4, నిజామాబాద్ 4, కరీంనగర్ 1, జగిత్యాల 1, వరంగల్ అర్బన్ 4, జనగాంలో 7 కేసులు నమోదయ్యాయి. అటు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2,477 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇలా కేవలం హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోనే 90% కరోనా కేసులు నమోదు కావడాం గమనార్హం. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వారు మంరింత జాగ్రత్తపడినా మరియు ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళకుండా ఉన్నా సరిపోతుంది అని నిపుణుల సలహా.