కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు గత వారం పది రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా ఏదో విధంగా కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పుడు ఈ వైరస్ తెలుగు సినీ పరిశ్రమ వారికి దాపరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కరోనా వైరస్ ఎంటరయిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాత – నటుడు బండ్ల గణేశ్ కు కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది.
ఈ శుక్రవారం 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో హైదరాబాద్ లో 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ వైరస్ సోకిన వారిలో బండ్ల గణేశ్ కూడా ఉన్నారని తెలిసి సినీ వర్గాలు ఉలిక్కి పడ్డారు. బండ్ల గణేశ్ కు పాజిటివ్ వచ్చిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో కరోనా వైరస్ సోకిన మొదటి వ్యక్తి బండ్ల గణేశ్ అని అంటున్నారు.
బండ్ల గణేశ్ సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టి హాస్య నటుడిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ – బాద్ షా, టెంపర్, గోవిందుడు అందరి వాడేలే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. సినీ పరిశ్రమలో కొనసాగుతూనే పౌల్ట్రీ వ్యాపారం గణేశ్ నిర్వహిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!