సమాజంలో రోజు రోజుకీ బంధాలకు విలువ అనేది లేకుండా పోతోంది. మనుషులు ఆటవికంగా మారిపోయి సొంత పెళ్ళాం పిల్లలనే ఆట వస్తువులుగా మార్చేస్తున్నారు. ఇది తాగుడికి మరియు పేకాట కి పూర్తిగా బానిసైపోయిన ఓ ప్రబుద్ధుడి కథ. బెట్టింగ్ లో తాను ఓడిపోతే తన భార్యను రేప్ చేసుకోవచ్చు అంటూ సొంత పెళ్ళాన్ని పేకాటలో తాకట్టు పెట్టాడు. అతను ఇచ్చిన ఈ ఆఫర్ కు ఆ పేకాటరాయుళ్లు చెలరేగిపోయి మరీ పందెం కాశారు.
చివరికి ఆ ప్రబుద్ధుడు ఓడిపోవడంతో తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దానితో వారు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా తన భర్త మద్యానికి బానిసై డబ్బు లేకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. పేకాట లో ఓడిపోయిన సుశీల్ తన భార్యను స్నేహితులకు అప్పగించగా వారు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీంతో ఆమె బాధతో ఇంటికి వెళ్లగా తన వెనకే వచ్చిన భర్త ఆమెను మన్నించమని వేడుకోగా ఆమె మనసు మార్చుకుని తిరిగి రావడానికి ఒప్పుకుంది.
అయితే తన దుర్బుద్ధిని మార్చుకోని సుశీల్ మార్గంమధ్యలో కారు నిలిపివేసి తన స్నేహితులను మరోసారి ఆమెపై లైంగికదాడి చేయమని ప్రోత్సహించాడు. భర్త స్నేహితుడైన అరుణ్ అతడి బంధువు అనిల్ తరచుగా తమ ఇంటికొచ్చి మందు తాగుతూ పేకాట ఆడతారని ఒక రోజు తన భర్త పందెం కాశాడని.. ఓడటంతో.. అరుణ్ అనిల్ కలిసి తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.