ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి గడ్డుకాలం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు వారి పార్టీలోని కీలక నేతలు అందరూ జైలు బాట పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి మరియు పార్టీలోని సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయన అరెస్టు అనివార్యం అని అందరూ చెబుతుండగా…. అతని పై నమోదైన కేసు నిర్భయ కేసు కావడం గమనార్హం.
ఇదే కేసు విషయమై ఆయన హైకోర్టు కి వెళ్లి తన పైన అక్రమంగా కేసు నమోదు చేశారని వాదనలు వినిపిస్తున్నారు. అయితే తప్పకుండా అయ్యన్న ను అరెస్ట్ చేయించి తీరుతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నర్సీపట్నం మహిళా కమిషనర్ ను అసభ్య పదజాలంతో దూషించిన అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు అన్నీ ఆడియో మరియు వీడియో ద్వారా రికార్డు అయి ఆధారాలతో సహా ఉన్నాయని ఆమె అంటున్నారు.
ఈ తతంగమంతా చూస్తుంటే అచ్చెన్నాయుడు అరెస్ట్ ను మించిన హైడ్రామా అయ్యన్నపాత్రుడు అరెస్టు లో జరగబోతోందని మనకి స్పష్టంగా అర్థం అవుతోంది. అదీ కాకుండా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఒక మహిళా కమిషనర్ వంటి చారిని దూషిస్తే చంద్రబాబు ఆయనకు మద్దతుగా రావడం దారుణమని అన్నారు. మహిళలు అంటే టీడీపీకి అంత చులకనగా ఉందా అంటూ…. మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకోవద్దా అని మొత్తం తెలుగుదేశం పార్టీని ఒక రేంజిలో వేసుకున్నారు. మరి అయ్యన్న భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగితే చాలు.