Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్ అయి అప్పుడే వారం రోజులైపోయింది. టెలివిజన్ రంగంలో అతి పెద్ద రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో… తెలుగులో 5 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. తాజాగా ఓటీటి ప్లాట్ ఫామ్ లో… నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా 24 గంటలు స్ట్రీమింగ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బిగ్ బాస్ తెలుగు ఓటిటిలో 17 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా అందులో 9 మంది కొత్తవాళ్ళు..మిగతా 8 మంది మాజీ ఆటగాళ్లు. ఇదిలా ఉంటే మొదటి వారం నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం తెలిసిందే. అయితే జరిగిన ఓటింగ్ పరంగా వీరిలో మిత్రశర్మ ఇంటి నుండి గ్యారెంటీగా ఎలిమినేట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ముమైత్ ఖాన్ చివరాకరికి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. కొద్దిపాటి ఓటింగ్ తేడాతో మిత్రశర్మ కంటే చివరిలో ముమైత్ ఖాన్ ఉండటంతో… ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
అయితే ఎలిమినేషన్ సమయంలో నవ్వుతూ కనిపించిన ముమైత్ ఖాన్… స్టేజి మీదికి వచ్చేసరికి… బోరున ఏడ్చేసింది. అంతమాత్రమే కాదు స్టార్టింగ్ బిగ్బాస్ సీజన్ లో తనపై పడిన మార్కు తొలగించుకోవడానికి… ఈ షోలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ముమైత్.. ఈ రీతిగా మాట్లాడింది..”బిగ్ బాస్ స్టార్టింగ్ సీజన్ లో నన్ను కావాలని బ్యాడ్ గా చూపించారు. దీంతో నాపై పడినా మార్క్ నీ తొలగించుకోవాలనే ఉద్దేశంతో…ఓటిటి బిగ్ బాస్ షోలో పాల్గొనడం జరిగింది. కానీ ఇంత త్వరగా బయటకు వెళ్లాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు.
ఎంతో బాధగా ఉంది. ఇప్పటికీ కూడా నన్ను కావాలనే బ్యాడ్ గా చూపించారు. కొంతమంది కంటెస్టెంట్ లు కూడా … కావాలనే బ్యాడ్ చేశారు. ఇక ఇదే సమయంలో.. స్టేజ్ పై ఉన్న నాగార్జున ఇంటిలో ఎవరూ పనికిరాని వాళ్ళు..? ఎవరు విలువైన వాళ్ళు అంటూ ముమైత్ ఖాన్ ని నాగార్జున ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ చెప్పుకొచ్చింది. మొత్తం మీద మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఇంటి నుండి ఎలిమినేట్ కావటం సంచలనంగా మారింది.