“ఏం మాయ చేశావే” అంటూ వెండితెరకు పరిచయమై.. కుర్రకారును నిజంగానే మాయచేసి.. వారి గుండెల్లో గూడు కట్టుకున్న నటి సమంత. అక్కినేని నటవారసుడు నాగ చైతన్య.. సమంత కలిసి నటించిన ఈ సినిమాతోనే ఇద్దరు ప్రేమలో పడి.. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వత కూడా పలు సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది ఈ కుందనపు బొమ్మ.
ఇటీవల “ఓ బేబీ, జాను” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముందుగుమ్మ పలు షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ.. బిజీబిజీ అయింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నానంటూ సమంతా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే, సంచలనాలు సృష్టించి… ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణను సంపాదించుకున్న హిందీ వెబ్ సిరీస్ “ఫ్యామిలీ మ్యాన్”. ఇప్పుడు సామ్.. “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఈ వెబ్ సిరీస్లో ఆమె నెగటివ్ రోల్ పోషిస్తోంది. ఈ పాత్ర ద్వారా సరికొత్త సమంతాను చూస్తారని ఇదివరకే సామ్ కూడా తెలిపింది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. సమంతా నెగటివ్ రోల్ తో దానికి మరింత క్రేజ్ పెరిగింది. దీనితో పాటు మరో వెబ్ సిరీస్ కోసం కూడా సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సినిమాలతో బీజీగా ఉన్న సమంతా.. బిజినెస్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన మిత్రులతో కలిసి.. ఓ బిజినెస్ను స్టార్ట్ చేసింది ఈ అమ్మడు.
తాజాగా మరో వార్తా సినీ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. తన ప్యామిలీ నేతృత్వంలో భవిష్యత్తులో ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ను తీసుకురావడానికి సామ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందట. దాని కోసమే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ “ఆహా” కోసం చేస్తున్న “సామ్జామ్ షో”కు హోస్టుగా చేయడానికి ఒప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ సొంతంగా పెట్టబోయే ఓటీటీకి ఇది ట్రయల్స్ లా ఉంటుందని అనుకుంటోందట ఈ అమ్మడు. ఆ ఆలోచనతోనే ఈ పనిచేస్తోందట. చూడాలి మరి సామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎప్పుడొస్తుందో..!
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!