Corona Virus: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. పుట్టిన రెండు రోజులకి ఓ చిన్నారి కి కరోనా వైరస్ సోకింది. 14 రోజుల పాటు చికిత్స పొందుతూ హాస్పిటల్లో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సూరత్ కు చెందిన మహిళ అ ఇటీవల డెలివరీ అవగా ఆడశిశువు జన్మించింది. బిడ్డ పుట్టిన రెండు రోజులకే కరోనా సోకినట్లు గుర్తించారు.. ప్లాస్మా ఇచ్చినా వైద్యులు ఆ శిశువును కాపాడలేకపోయారు. శిశువు తల్లికి కరోనా లక్షణాలు ఉన్నా.. ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. పైగా బిడ్డ పుట్టిన తర్వాత పాలు పట్టించింది. దీంతో బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపింది. వెంటనే చిన్నారిని చికిత్స కోసం సూరత్ వరచా లోని డైమండ్ హాస్పటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ గురువారం నవజాత శిశువు మరణించింది. సూరత్ లో ఇప్పటికే వైరస్ ప్రభావంతో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. న్యూ సివిల్ హాస్పిటల్ లో రెండు రోజుల కింద కరోనాతో నవజాత శిశువు మరణించింది. కరోనా మహమ్మారి రెండో దశలో పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు.