Big Breaking : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతం అవుతోంది. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, పలువురు బాలివుడ్ నటులు కరోనా బారిన పడ్డారు.
తాగాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 3వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆనంతరం ఆయన వ్యక్తిగత సిబ్బంది పలువురికి కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ అప్పటి నుండి సల్ప్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఆయన జ్వరం ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పవన్ ఉపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
పవన్ కు కరోనా నిర్ధారణ అయినట్లు తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారని, క్షేమంగా ఉన్నారని తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు క్రిష్ తో ఫ్యాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు మువీ చేస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్, రమేష్ వర్మ దర్శకత్వంలో మరో మువీ చేయనున్నట్లు సమాచారం.