Mobile Theaters: సినిమాలు ఎక్కువగా ప్రేమించే ప్రజలు దక్షిణాదిలో ముందుగా తమిళ ప్రజలు ఆ తర్వాత తెలుగు ప్రజలు అని చాలామంది అంటారు. అంతమాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ తర్వాత అతి పెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్ అని కూడా చెప్పుకోస్తారు. సినిమా మార్కెట్ పరంగా టాలీవుడ్ చాలా పెద్దదని కూడా చెబుతారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లు ఎక్కువ. జనాభా పరంగా కూడా తెలంగాణ కంటే ఆంధ్ర ఏ పై స్థానంలో ఉంది.దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకి ఎక్కువ లాభాలు ఆంధ్ర థియేటర్ ల వల్లే వస్తాయని.. ట్రేడ్ వర్గాలు అంటుంటాయి. అటువంటి సినిమాని బాగా ప్రేమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మొబైల్ సినిమా థియేటర్లు రాబోతున్నాయి. మొబైల్ సినిమా థియేటర్ అంటే ట్రక్కులో థియేటర్ ఉంటుంది. ఆ వాహనం ఎక్కడపడితే అక్కడ కి వెళ్ళవచ్చు. ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి … సినిమాని ప్రదర్శించే సామాగ్రి…చైర్స్.. టెంట్ అని ఉంటాయి. అయితే ఈ మొబైల్ సినిమా హాల్ ముందుగా ప్రయోగాత్మకంగా రాజానగరం వద్ద నేషనల్ హైవే హబిటెట్… ఫుడ్ కోర్టు ప్రాంగణంలో.. ప్రారంభించబోతున్నారు.వెదర్ ప్రూఫ్… రాయల్ ప్రూఫ్ పద్ధతిలో వేసిన టెంట్ లో గాలి నింపే టెక్నాలజీతో… దాదాపు 120 సిట్ల కెపాసిటీతో… థియేటర్ రూపొందిస్తున్నారు. “పిక్చర్ డిజిటల్” అనే సంస్థ.. ఏపీలో నెలకొల్పుతున్న ఈ మొదటి మొబైల్ థియేటర్ లో .. మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” సినిమా ప్రదర్శితం చేయనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , చరణ్ నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజానగరం వద్ద నేషనల్ హైవే ప్రాంగణంలో ఈ మొదటి మొబైల్ థియేటర్ “ఆచార్య” మూవీతో ప్రారంభం కానున్నట్లు వార్తలు రావడంతో రాజానగరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో మొదటి దశలో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొబైల్ థియేటర్లు తీసుకొచ్చే ఆలోచనలో పిక్చర్ డిజిటల్ సంస్థ ఉన్నట్లు సమాచారం.