ఐపీఎల్ ఆరంభంలో ఎన్నో రసవత్తర మ్యాచ్ లను చూశాం. అయితే రాను రాను చాలా మ్యాచ్ లు ఏకపక్షం అయిపోతున్నాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ లాగానే రాజస్థాన్ రాయల్స్ కూడా వరుసగా పరాజయాల బాట పడుతుంది. ఈ టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది. షార్జా లాంటి చిన్న గ్రౌండ్ లో బ్యాటింగ్ లో తడబడడంతో ఒక మాదిరి స్కోరుని ఛేజ్ చేయలేక రాజస్థాన్ చతికిలపడింది.
ఢిల్లీ జట్టులో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ షిమ్రొన్ హెట్మేయర్ 45 పరుగులతో మెరవడం తో ఢిల్లీ 26 నష్టానికి 184 పరుగులు చేసింది. ఎప్పటిలా కాకుండా ఈసారి రాజస్థాన్ బౌలర్లు ఆదిలోనే వికెట్లు తీశారు. ఢిల్లీ బ్యాట్స్మెన్ కూడా టోర్నీ లో మొదటిసారి తడబడినట్లు కనిపించింది. పృద్వి షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ అవుట్ పవర్ ప్లే లోపలే అవుట్ అయిపోయారు. అయితే ఢిల్లీ బ్యాట్స్మెన్ మాత్రం రన్ రేట్ మరీ తగ్గకుండా చూశారు.
రిషబ్ పంత్ కూడా మెరవకపోవడంతో హిట్టింగ్ బాధ్యతను ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టాయినిస్, హెట్మేయర్ తీసుకున్నారు. చివర్లో హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ కొన్ని బౌండరీలు రాబట్టడంతో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 184 పరుగులు చేసింది.
చేతనలో రాజస్థాన్ భీకర ఓపెనర్ జాస్ బట్లర్ తొందరగానే వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి పార్టానర్షిప్ ఇచ్చారు. ఎప్పుడైతే స్మిత్ అవుటయ్యాడో.. వెంటనే సంజు శాంసన్, మహిపాల్ లోంరోర్, యశస్వి జైస్వాల్ కూడా వికెట్లు ఇచ్చారు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్ కు తోడు సమయానుకూలంగా కెప్టెన్ అయ్యర్ చేసిన బౌలింగ్ మార్పులు మంచి ఫలితాన్ని అందించాయి.
రాహుల్ తెవాటియా తన వంతు ప్రయత్నం చేసినప్పటికే సాధించాల్సిన స్కోరు చాలా ఎక్కువ అయిపోయింది. చివరికి 138 పరుగులకు రెండు బంతులు మిగిలి ఉండగానే ఆల్ అవుట్ అయిన ఢిల్లీ 46 పరుగుల భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.