Jhanvi Kapoor : శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. అందాల తార కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో సత్తా చాటి మంచి పేరును తెచ్చుకుంది జాన్వి.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరుచూ తిరుమల వెళ్తూ ఉంటుంది.. శ్రీదేవి కి ఈ పుణ్యక్షేత్రం అంటే ఎంతో ఇష్టమో.. జాన్వి కూడా అంతే ఇష్టమట.. అందుకే వీలు దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు తన పెళ్లి సీక్రెట్ గురించి ఇలా వివరించింది..!!
తిరుపతి లోనే హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటుందట.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర ఘట్టం. దాన్ని నేను అదే రీతిలో జరుపుకుంటా. మరీ ముఖ్యంగా నేను తిరుపతి లోనే పెళ్లి చేసుకుంటాను. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టం. అందుకే తరచూ వస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.. తిరుపతిలో జరిగిన నా పెళ్లి సంప్రదాయ పద్ధతుల్లోనే జరిగేలా చూసుకుంటాను. ఇందుకోసం నేను కాంచీపురం పట్టు చీర కట్టుకుంటాను.. అలాగే నాకు కాబోయే వాడు లుంగీ పంచె తో వస్తాడు.. అలాగే మేము మా వివాహ విందును అరటి ఆకులోనే భోజనం చేస్తాం అంటూ తన మనసులోని భావాలను షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు తన పెళ్లి సీక్రెట్ ని రివీల్ చేసింది.. అంతే కాకుండా దక్షిణాది పై ఉన్న ఇష్టాన్ని కూడా బయటపెట్టింది.