నువ్వక్కడ.. నేనిక్కడ.. అంటూ మొదలుపెట్టిన కాకినాడ మరియు కోనసీమ జిల్లా కలెక్టర్ల ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్ళింది. ఒకరిది చండీగఢ్ మరొకరిది ఉత్తర ప్రదేశ్. కలెక్టర్ అవ్వాలని ఇద్దరి లక్ష్యం. కఠోర శ్రమతో గమ్యం వైపు అడుగులు వేశారు. అదేవిధంగా ఐఏఎస్ శిక్షణకు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి స్నేహం బలపడింది.
మనసులు కలిసి ప్రేమగా చిగురించింది. ఇద్దరి తల్లిదండ్రులకు వీరితోపాటు వీరి కష్టాలు నచ్చాయి. 2013లో ప్రేమతో మొదలైన ఈ జంట 2015లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నిత్యం వారికి ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తూ ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం పక్క పక్క జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ హిమాన్షు. కాకినాడ కలెక్టర్ కృతికా దంపతులు.
హిమాన్షు తిరుపతిలో సబ్ ఇన్స్పెక్టర్గా.. పర్యాటక శాఖ ఎండీగా.. గుంటూరు, పశ్చిమగోదావరి జేసీ గా పని చేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. కృతికా జేఏసీ గా గుంటూరు, కృష్ణ జిల్లాల్లో పనిచేశారు. ఇక వీరు కాకినాడ కలెక్టర్గా వచ్చారు. ఈ క్రమంలోనే..” వ్యక్తి ఉద్యోగ ప్రభావం కుటుంబం పై కానీ తమ ప్రేమ బంధం పై పడకూడదు. ఏదైనా ఆపద వస్తే ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి. అదే మా ప్రేమకి బలం కూడా. నిజానికి మా ప్రేమలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. వాటన్నిటిని ఎదుర్కొని మేము కలిసి ఉంటున్నాం ” అని పేర్కొన్నారు.