బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఐదవ వారం నామినేషన్ ప్రక్రియ ఎంత జోరుగా సాగిందో అందరికీ తెలిసిందే. గొడవలు పోట్లాటల మధ్య గట్టిగా అరుచుకోవడాల మధ్య చాలా మంది ఈ సారి నామినేషన్ లో నిలిచారు. అయితే అభిజిత్, అఖిల్, సోహెల్ ప్రధానంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ లో బాగా ఫోకస్ అయ్యారు. వీరందరి కారణాలు వాగ్వాదాలు మిగతా వారిని పూర్తిగా డామినేట్ చేశాయి. అయితే దీనివల్ల వారు సాధించింది ఏమీ లేదని అర్థం అవుతోంది.
ఈ రోజు శనివారం నాగార్జున ఇంటి సభ్యులను కలిసేందుకు వచ్చిన సమయంలో చాలామంది పై విపరీతంగా ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ లు అసలు మోనాల్ టాపిక్ అసలు తమ గొడవ మధ్యలో ఎందుకు తీసుకుని వస్తున్నారు అని నిలదీశాడు. తను అక్కడ మిమ్మల్ని తన పేరుని వాడొద్దని ప్రాధేయ డుతూ ఉంటే మీరు అలా ఎలా గొడవ పడతారు అని అడిగాడు.
అభిజిత్ మధ్యలో మోనాల్ గురించి మాట్లాడడం ఇష్టం లేదని.. అఖిల్ తన టాపిక్ తీసుకొని వచ్చాడు అని చెప్పినప్పుడు అతని తీసుకొని వచ్చాడు సరే నువ్వు ఎందుకు ఆపలేదని ప్రశ్నించాడు. ఇక అదే సమయంలో సోహెల్ పైన మరింత విపరీతంగా నాగార్జున సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడే వాయిస్ చాలా హై పిచ్ లో ఉంది…. అని ఇంకోసారి అమ్మాయిల పైన అలా అలరిస్తే నీకు ఏం జరుగుతుందో తెలుసా…. అంటూ తన దగ్గర ఉన్న కొరడాను గట్టిగా ఝళిపించాడు.
Weekend Kick ki King ready…Miru ready ye kada..It's going to be fun!!!#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/vgxnvh9cHu
— starmaa (@StarMaa) October 10, 2020
కాబట్టి ఇకనుండి ఇంటిలో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని కంటెస్టెంట్స్ కు అర్థం అయింది అన్నమాట.