SBI Alert: దేశీయ దిగ్గజం బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది.. సైబర్ మోసాలను గుర్తించి వాటిని ఖాతాదారులకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఎస్బిఐ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. కరోనా తో పాటు మోసగాళ్ల వలలో వాడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది..
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని ఎస్బిఐ తెలిపింది. మోసగాళ్లు మెడిసిన్స్ పేరు చెప్పి డబ్బులు దొంగలించి అవకాశం ఉందని హెచ్చరించింది . అలాగే ప్రాణాలను కాపాడే ఔషధాల పేరుతో మోసాలు జరగొచ్చని తెలిపింది. మెడిసిన్స్ డబ్బులు చెల్లించడానికి ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలని ఎస్బిఐ తన కస్టమర్లను కోరింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో కస్టమర్లను మోసం చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై ఆఫర్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుందని ఎస్బిఐ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ ఈ విషయాన్ని వెల్లడించిందిి. కాబట్టి డబ్బులు చెల్లించే టప్పుడు బెనిఫిషరీ వివరాలు కరెక్టుగా ఉండేలా చూసుకోండి. బెనిఫిషరీ వివరాల గురించి పూర్తిగా ఆరా తీయకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారని హెచ్చరించింది ఎస్బిఐ.
Please ensure to verify the authenticity of the beneficiary you are dealing with before making any payment. pic.twitter.com/ilFFyseglP
— State Bank of India (@TheOfficialSBI) April 23, 2021