Mobile: ఈ రోజులలో ఫోన్ ఎంత ముఖ్యమైపోయినదో మనందరికీ తెలుసు… బెడ్ రూం లో వంటగదిలో డైనింగ్ టేబుల్ మీద ఆఖరికి బాత్రూం లో మొబైల్ ఫోన్ వాడేస్తున్నారు.ఇది నిజం చాల మంది టాయ్లెట్కి వెళ్లేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్ లేకుండా ఉండడం లేదు. అయితే ఫోన్ ని అలా తీసుకెళ్లడం వల్ల డయేరియా,మూత్ర సంబంధ వ్యాధుల కి దారితీసే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాయిలెట్కు వెళ్ళినప్పుడు ఫోన్ ని తీసుకెళ్లడం వల్ల పైల్స్ వ్యాధి కూడా వస్తుందట. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం.. టాయిలెట్ లో ఫోన్ ని వాడడం వల్ల మాములు సమయం సమయం కన్నా ఎక్కువ సమయం టాయిలెట్లో కూర్చుంటారు.దీనివలన పైల్స్ వస్తుంది.ఇక టాయ్లెట్లో ఉండే సింకులు, పంపులు మీద రోగాలు కలిగించే బాక్టీరియాఉండి.. టాయ్లెట్ లో కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్లను ముట్టుకున్న చేతులతోనే మళ్లీ మొబైల్ పట్టుకోవడం వల్ల బాక్టీరియా నేరుగా ఫోన్ మీదకి చేరుతుంది. ఎప్పుడూమనతోనే ఉండే ఫోన్ నుంచి ఏదో రకంగా బాక్టీరియా శరీరంలోకి చేరే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
కొన్ని పనుల మీద శ్రద్ద పెట్టకపోవడం వల్ల కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. వాడుకునే బ్యాగులను శుభ్రం చేయకపోవడం, బూట్లను ఇంటి లోపల విప్పడం, వేసుకోవడం… టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల కూడా వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ అనే చెప్పాలి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.