ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నిమ్మగడ్డ వ్యవహారంలో దూకుడుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న హరిచందన్ ఈ విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారానికి ముందే రాజకీయ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు గవర్నర్ కు పంపి పెద్ద తప్పు చేశాము అని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఆ వ్యవహారంలో అంటే హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి గవర్నర్ వేరే దారిలేక నిమ్మగడ్డ నియామకానికి ఆదేశించారు. కానీ ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అది కాకుండా రాజధాని మార్పు కు సంబంధించి బిల్లులపై గవర్నర్ నిర్ణయం ఇలా ఉండొచ్చు అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నిర్ణయాన్ని స్వంతంగా ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అన్న ప్రశ్నలు కూడా అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి.
ఏదేమైనా ఈ రోజే రాజధాని వ్యవహారంలో గవర్నర్ అటో.. ఇటో తేల్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం రాజ్ భవన్ నుండి బయటకు వస్తుంది అనేది తెలుసుకోవాలంటే కొద్ది సేపు వేచి చూడాల్సిందే.