దేశ రాజకీయాలలో తనకంటే సీనియర్ నేత లేరని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మీడియా ముందు తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏపీలో ఫోన్ టాపింగ్ విషయంలో ఎలాంటి ఆధారం లేకుండా ప్రధాన మోడీ కి లెటర్ రాయడం తో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎంతో అనుభవం ఉండి చంద్రబాబు ఈ రకంగా లెటర్ రాయడం చాలా కామెడీగా ఉంది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఏపీలో ఇద్దరు జడ్జీల మధ్య ఫోన్ లో జరిగిన సంభాషణ ఆడియో టేప్ ఏపీ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
టిడిపి పార్టీకి మద్దతు తెలిపే పేరు కలిగినా ఒక సెక్షన్ అఫ్ మీడియా ఈ ఫోన్ ట్యాపింగ్ కథనాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే అసలు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా సదరు మీడియా వర్గాలు దగ్గర లేని, ఈ వార్తతో చంద్రబాబు ఏకంగా భారత ప్రధానికి లెటర్ రాస్తూ ఏపీ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నట్లు, ప్రభుత్వం కక్షగట్టి ప్రభుత్వ వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
ఒక జడ్జి ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్కరి ఫోనులు ట్యాప్ చేస్తున్నట్లు మోడీకి చంద్రబాబు రాసిన లెటర్ లో ప్రస్తావించారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ప్రభుత్వంపై చంద్రబాబు మీడియా లో ఉన్న కథనాన్ని ఆధారం చేసుకుని ఫిర్యాదు చేయటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ? ఇంకొక్కసారి చెప్పుకోకు చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.