సైరా వంటి భారీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ పతాకాలపై సంయుక్తంగా రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు ఉద్యమ నాయకుడు కామ్రేడ్ గా నటిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆచార్య సినిమా గురించే ఎన్నో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమాకోసం మూడేళ్ళు సమయం కేటాయించాడు. ఎట్టకేలకి సినిమా మొదలైందనుకుంటుండాగానే అనూహ్యంగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటి వరకు 40 శాతం టాకీపార్ట్ అండ్ ఒక సాంగ్ కంప్లీటయిన ఆచార్య సినిమాని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి గాని ప్రస్తుతం పరిస్థితి అదుపులో లేకపోవడంతో పక్కా క్లారిటీ రావడం లేదు.
చిత్రీకరణ ఆలస్యం కారణంగానే ఆచార్య సినిమాని 2021 ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తామని మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మేకర్స్ తెలిపారు. అప్పటికైనా సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే ‘ఆచార్య’ సినిమాని వీలైనంత త్వరగా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని అందరూ భావిస్తున్నారు. జూన్ లో షూటింగ్ మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేసింది. కానీ అంత కంతకు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మేకర్స్ వెనక్కి తగ్గారు.
తాజాగా ఈ నెల రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదని చిరంజీవి- కొరటాల శివ బృందం అనుకుంటున్నట్టు తెలుస్తుంది. పరిస్థితులను బట్టి నవంబర్ రెండవ వారం నుంచి ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారట. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రానిందని తెలుస్తుంది.