దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. నూతన నిబంధనల ప్రకారం ఎస్బీఐకు సంబంధించిన కొన్ని రకాల సర్వీసులు నిలిచిపోయాయి. ఎస్బీఐ ఖాతాదారులు ఈ విషయాలను తెలుసుకోని పక్షంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లు ఇకపై ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్లను నిర్వహించలేరు.
ఎస్బీఐ కస్టమర్లు ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్లను నిర్వహించాలని భావిస్తే బ్యాంకుకు వెళ్లి ఫామ్ నింపి ఆ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ కొత్త నిబంధనలను అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఖాతాదారులు అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించాలని భావిస్తే intl అని టైప్ చేసి 5676791 నంబర్ కు మెసేజ్ చేసి కూడా ఆ సర్వీసులను పొందవచ్చు.
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉండటంతో ఆర్బీఐ కొన్ని నెలల క్రితమే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. కరోనా, లాక్ డౌన్, ఇతర కారణాల వల్ల నిబంధనలు ఆలస్యంగా అమలవుతున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు అవసరం లేదని భావించే వాళ్లు ఈ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కు ఏ నంబర్ ను అనుసంధానం చేస్తామో ఆ నంబర్ నుంచే సందేశాలను పంపే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది. కాంటాక్ట్లెస్ లావాదేవీలు, ఆన్ లైన్ లావాదేవీలు, కార్డ్ నాట్ ప్రజెంట్ లావాదేవీలు కూడా బ్యాంకుకు వెళ్లి కస్టమర్లు యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.