బిగ్ బాస్ నాలుగో సీజన్ లో 30వ రోజు కూడా ‘బిబి హోటల్’ టాస్క్ కొనసాగింది. గత ఎపిసోడ్ తో పోలిస్తే ఈ ఎపిసోడ్ చాలా ఇంకా ఫన్, ఫైర్, ఎంటర్టైన్మెంట్ తో సాగింది. హోటల్ సర్వీస్ బాగా లేదన్న కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో హోటల్ స్టాఫ్ కు ధనవంతులకు మధ్య చిచ్చు పెట్టేందుకు సీక్రెట్ లో భాగంగా అవినాష్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే మెహబూబ్ కోపం తెచ్చుకోవడంతో అవినాష్ అతని కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే….
బిగ్ బాస్ హోటల్ కి వచ్చిన అతిథులు మెహబూబ్, సోహెల్ లకు సరైన ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెట్టారు.మ్ సోహెల్ కు పెట్టిన బిర్యానిలో వెంట్రుక వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అడిగినవి రాకుండా చివరికి లేవు అని చెప్పడంతో మళ్ళీ గొడవ అయింది. ఇక మెహబూబ్ తినే నాన్-వెజ్ లో చాలా ఉప్పు వేశాదు అవినాష్. సరైన ఫుడ్ పెట్టడం లేదు సర్వీస్ అసలు బాగోలేదు అని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదంతా అవినాష్ చేస్తున్న పనులని అర్థం కాలేదు. అలాగే చికెన్, మటన్ భారీగా ఉప్పు వేసి వారికి మండించడం జరిగింది. దాని వల్ల ఇంటి సభ్యులైన మిగతావారైన స్టాఫ్ తిట్లు తింటూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో అభిప్రాయబేధాలు రావడం మొదలయ్యాయి. ఒక గ్రూపు పైన మరొక గ్రూపులో విరుచుకుపడుతూ ఉన్నారు. అప్పుడు మహబూబ్ మాట్లాడుతుంటే అవినాష్ కామెడీ చేస్తున్నాడు.
మామూలుగానే మెహబూబ్ కోపదారి మనిషి. ఇక అతను ఉండబట్టలేక ఎవరైనా ఎక్కువ మాట్లాడితే “పుచ్చలు ఎగిరిపోతాయి” అంటూ రెండు మూడుసార్లు అరిచాడు. దీంతో అతనిపై అఖిల్ ఆగ్రహం చెందాడు. మర్యాదగా మాట్లాడమని ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని మెహబూబ్ కి చెప్పాడు. ఇక పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వచ్చిన అవినాష్ కొంతసేపు కామెడీ చేశాడు కానీ తర్వాత మెహబూబ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇది బిగ్ బాస్ హౌస్ అని ఏమైనా ఉంటే మీ ఇంటికి వెళ్లి అరుచుకోమని కానీ ఇక్కడ ఇలా అయితే కుదరదు అని అన్నాడు.