బంగారం ధరలు ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అలాంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గింది. కరోనా వైరస్ రావడం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్ప కూలడం.. ఇక ఏది లేక ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో ఎప్పుడో మూడేళ్ల తర్వాత ఉండాల్సిన బంగారం ధరలు ఇప్పుడే పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా వారం కిందట అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దేశీయ మార్కెట్లో దీని ప్రభావం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు… రెండు రోజుల నుండి మరింత తగ్గుతూ ఈరోజు నేల చూపులు చూస్తుంది. కాగా ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గగా వెండి ధర భారీగా పెరిగింది.
బహుశా నాణేపు తయారీదారుల నుండి డిమాండ్ తక్కువగా ఉండటంతో ధరలు ఇలా ఉన్నాయని తెలుస్తుంది. ఈరోజు బంగారం ధర దిగి రాగా ఢీల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.694 తగ్గి రూ.51,215 చేరగా కిలో వెండి ధర రూ.126 పెరిగి రూ.63,427 చేరింది. నిన్న 10 గ్రాముల ధర రూ.51,909 వద్ద ఉండగా, కేజీ వెండి రూ.126 పెరిగి రూ.63,427 వద్ద ముగిసింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగిందని అందుకే ఇలా బంగారం ధర భారత్ లో పెరిగిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు!