గత కొద్ది నెలల కాలం నుంచి కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఏ వస్తువులు తాకాలన్న ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే కరోనా వైరస్ ప్రతి వస్తువు పైన జీవించి ఉంటుంది. మనం నిత్యం వాడే వస్తువుల లో స్మార్ట్ ఫోన్లు, స్క్రీన్లు, స్టీల్, గాజు, ప్లాస్టిక్ వస్తువులపై కరోనా వైరస్ దాదాపుగా 28 రోజుల పాటు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. మనం ప్రతి రోజూ వాడే వస్తువులను తాకినప్పుడు వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం, లేదా శానిటేషన్ చేయడం వంటి ఈ పద్ధతులను పాటించడం ద్వారా కరోనా వైరస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
కరోనా వైరస్ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద దాని మనుగడను కొనసాగిస్తుందని పరిశోధకులు తెలిపారు. 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ స్మార్ట్ ఫోన్, గ్లాస్ వస్తువులపై, ప్లాస్టిక్ వస్తువుల పై 20 రోజులపాటు జీవించి ఉంటుంది. గ్లాస్ వస్తువులను, స్టీల్ వస్తువులను మనం నిత్య జీవితంలో ఉపయోగించే టప్పుడు వాటికి శానిటేషన్ చేయడంవల్ల కరోనా వైరస్ ను నాశనం చేయవచ్చు. కానీ స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రికల్ వస్తువుల పై శానిటేషన్ చేయడం ద్వారా కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి వస్తువులను వాడినప్పుడు వీలైనంతవరకూ ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండటం ఎంతో మంచిది.
ప్రస్తుతం వేసవి కాలం మొదలవడంతో వాతావరణంలో ఉష్ణోగ్రత స్థాయి చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రముఖ వైరాలజీస్ట్ జుర్జెన్ రిచ్ట్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి ఎంతో అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ లు తప్పకుండా వాడాలని,బయటకు వెళ్ళినప్పుడు కచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.