సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొన్నటి వరకు సినిమా రంగానికి దూరమైన పవన్ ఈ ఏడాది ప్రారంభం నుండి వరుస సినిమాలని ఒప్పుకుంటూ కొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే మహేష్ కోసం అప్పట్లో సెట్ చేసిన జనగణమన స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడానికి పూరి రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పవన్ కి వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలంటే వచ్చే ఏడాది కాకుండా తర్వాత ఏడాది అనగా 2022లో సినిమా స్టార్ట్ అవ్వచ్చు అని టాక్ వస్తుంది.
మరి అంత వరకు వెయిట్ చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే వచ్చే ఏడాది లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, క్రిష్ అదేవిధంగా సురేందర్ రెడ్డి, సాగర్ చంద్ర వంటి దర్శకులతో పని చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు లు అయ్యేంతవరకూ పవన్ కోసం పూరి వేచి ఉంటారో లేదో చూడాలి.