సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీ పార్టీ పోటీ చేయనుంది. చాలా వరకు తమిళ రాజకీయాలు గమనిస్తే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్లంతా తమిళనాడు ముఖ్యమంత్రులుగా రాణించారు.
అంతకుముందు వీళ్లు సినిమా వాళ్ళు. చాలా వరకు తమిళ రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ తో ముడిపడివుంటాయి. ఇటువంటి నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికల బరిలోకి దిగనున్న రజినీకాంత్ డిసెంబర్ 31 వ తారీకు నాడు కొత్త పార్టీ విధి విధానాలు ప్రకటించబోతున్నట్లు మొన్న సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల సన్నిహితులతో రజినీకాంత్ భేటీ అయిన తరుణంలో ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చకు వచ్చిందట. ఈ నేపథ్యంలో సన్నిహితులు ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు గురించి రజినీకి వివరించారట. ప్రజలకు బాగా మంచి చేసే పథకాలు కావటం ఎంతో ఇవి అమలు చేయాలని రజిని కూడా బాగా లోతైన విశ్లేషణ జగన్ మేనిఫెస్టో పై చేస్తున్నారట. అంతేకాకుండా కుదిరితే వచ్చే ఎన్నికలకు ముందు జగన్ 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పదవులను కట్టబెట్టారో అదే తరహాలో తన కొత్త పార్టీ నాయకులకు పదవులు కేటాయించడానికి రజిని ఆలోచిస్తున్నట్లు తమిళ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరుణానిధి జయలలిత మరణాలతో వేడి తగ్గిన అరవ రాజకీయాలు.. రజిని, కమల్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో రసవత్తరంగా మారడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.