ఇండియాలో డిజిటల్ విప్లవంలో భాగంగా ప్రతి గ్రామానికి త్వరలోనే ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఇది అండగా చేసుకొని ఇండియా మార్కెట్లలో స్మార్ట్ ఫోన్ల నుండి స్మార్ట్ టీవీల అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉంది. హాంగ్ కాంగ్ దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ ఫీనిక్స్ ఇండియాలో తక్కువ ధరకే మంచి ఫిచర్స్ ఉన్న స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ టీవీలు రెండు మోడళ్లలో లభ్యమవుతున్నాయి. ఈ టివిలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయని, టీయూవీ రెయిన్ల్యాండ్ సర్టిఫికేషన్ పొందాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ టీవీల యొక్క ఫీచర్లు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తక్కువ ధరలో ఇన్ ఫీనిక్స్ సంస్థ ఇన్ ఫీనిక్స్ 32ఎక్స్1, 43ఎక్స్ మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు టీవీలలో మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోపాటు 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ స్పేస్ సమాచారాన్ని స్టోరేజ్ చేసుకునే సదుపాయాన్ని వీటిలో పొందుపరచారు. రెండు హెచ్డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, ఇన్ఫ్రా రెడ్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 32 అంగుళాల మోడళ్లలో ఉన్నాయి. ఇక 43 అంగుళాల టీవిలలో మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, బ్లూటూత్ 5.0, వైఫై, బ్లూటూత్, ఐఆర్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. 32 అంగుళాల మోడల్ లలో 20W స్పీకర్లను ఏర్పాటు చేయగా, 43 అంగుళాల వేరియంట్లో 24W స్పీకర్లను పొందుపరచారు. రెండిట్లోనూ గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉండడమే కాకుండా ఇంటర్ నెట్ సదుపాయం ఉంటె యూట్యూబ్, ప్రైమ్ వీడియో యాప్ తో పాటు పలు వీడియో యాప్స్ రెండూ మోడళ్లలో సపోర్ట్ చేస్తాయి.
టీయూవీ రెయిన్ల్యాండ్ సర్టిఫికేషన్ అనేది ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరు, నాణ్యతను పరిశీలించే సంస్థ. ఆ సంస్థ నుండి గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ టీవీలను ఉపయోగించడంలో నష్టమేమి లేదు. వీటిలో పిచ్చర్ క్వాలిటీగా కనిపించడానికి హెచ్డీఆర్10 సపోర్ట్, ఎపిక్ 2.0 ఇమేజ్ ఇంజిన్ కూడా ఇందులో ఉన్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.11,999గా, 43 అంగుళాల టీవీ ధర రూ.19,999గా . ఈ రెండు టీవీల సేల్ డిసెంబర్ 18వ తేదీ మధ్యహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్లో నుండి అమ్మకాలు జరుగనున్నాయి.