Nimmagadda Ramesh Kumar : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda Ramesh Kumar పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వ పథకాలు అన్ని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ఫోన్లు ఇచ్చేయాలని.. ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వటం అందరికీ తెలిసిందే.
ఇటువంటి తరుణంలో భారీ హంగామా చేస్తూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ఓపెనింగ్ చేసిన సీఎం జగన్ ఫిబ్రవరి మొదటి నుండి రేషన్ సరుకులు ఇంటింటికి అందించాలని రెడీ అవగా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న వరుస నిర్ణయాల దెబ్బకి రేషన్ డోర్ డెలివరీ పనులు కూడా మొన్నటివరకు జరిగే ప్రసక్తి లేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో రేషన్ డోర్ డెలివరీ విషయంలో ప్రభుత్వం న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విచారించిన న్యాయస్థానం ఇంటింటి రేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రేషన్ కార్యక్రమంలో ఏ రాజకీయపార్టీలు, నేతలు హాజరు కాకూడదని, రేషన్ సరఫరా చేసే వాహనాలపై పార్టీలకు సంబంధించిన రంగులు ఉండకూడదని, అలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలవాలని, ఎన్నికల కమిషన్ కూడా ఐదు రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీంతో కచ్చితంగా ఇంటిగ్రేషన్ కార్యక్రమం జరగడం గ్యారెంటీ అనే టాక్ వస్తుంది. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుపడితే ఖచ్చితంగా విపక్షాలకు భారీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని గ్యారెంటీగా ఆయన ఒప్పుకోవటం జరుగుతుందని కోర్టు తాజా ఆదేశాలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.