Mistery : ఒకే వీధి కీ చెందిన యువకులు అంతా అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, మరి ఎలాంటి ఇతర కారణాలు లేకుండానే యువకులు వరుసగా చని పోతూ ఉండడంతో ఆ వీధిలో ఇప్పుడు మృత్యు ఘంటికలు అలముకున్నాయి. ఒకే కాలనీకి చెందిన యువకులు.. ఒకరి తర్వాత మరొకరు ఎందుకు చని పోతున్నారు అన్న విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. వైద్యులు సైతం ఈ మిస్టరీ మీద మౌనం దాల్చారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అనారోగ్య కారణాలు ఏమీ లేవంటున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటల్లోనే మృతి చెందుతున్నారు. దీంతో ఆ కాలనీలో ఉన్న యువకుల్లో భయం భయం అలముకుంది. కొత్తగా దెయ్యం భయం పట్టుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆ కాలనీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. దీనిపై పలు మీడియా చానళ్లు పత్రికలు సైతం అవగాహన కల్పించిన ఆ కాలనీవాసులు లో భయం మాత్రం పోవడం లేదు. రోజురోజుకు యువకులు చని పోతూ ఉండడంతో , ఆ కాలనీ వాసుల్లో భయం పెరిగిపోయింది. వాళ్లకు అప్పటి వరకు ఉన్న ఓ అనుమానంపై ఈ మరణాల వల్ల మరింత భయం పెరిగింది.
ఒక్కో కుటుంబం కాలనీ విడిచి వెళ్ళి పోతూ
అంతే ఒక్కో కుటుంబం ఆ కాలనీని విడిచి వెళ్లిపోవడం స్టార్ట్ చేసింది. మొత్తానికి కాలనీలో ఉన్న మొత్తం 40 కుటుంబాలు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయాయి. ఆ కాలనీలో దెయ్యం తిరుగుతోందన్నదే వారికి కలిగిన భయం. ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, కాలనీలోని రోడ్లపై నగ్నంగా మహిళా తిరుగోందని ఆ కాలనీ వాసులు గుండెల్లో గుబులు పెంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఇది చోటు చేసుకుంది . బేడ, బుడగ జంగాల ప్రజలు ఓ కాలనీలో ప్రత్యేకంగా ఉంటుంటారు. ఆ కాలనీలో కొన్నాళ్లుగా ఓ పుకారు పుట్టింది. అర్ధరాత్రిళ్లు కాలనీలో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరిగింది. రోజూ రాత్రిళ్లు ఓ దెయ్యం తిరుగుతోందనీ, ఓ మహిళ నగ్నంగా బోణం ఎత్తుకుని నృత్యం చేస్తోందన్న వార్తలు అంతటా వ్యాపించాయి. అదే సమయంలో ఇటీవల ఆ కాలనీకి చెందిన యువకులు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. ఆ కాలనీకి చెందిన చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్ లో మరణించారు. వారం రోజుల వ్యవధిలోనే వారు చనిపోయారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు అనే వ్యక్తి ఇటీవల మరణించాడు.
ఈ ముగ్గురి మరణాలకు చేతబడే కారణమనీ, ఆ దెయ్యం వల్లే మరణించారని కాలనీ వాసులంతా నమ్ముతున్నారు. ’మా కాలనీల్లో యువకులు మాత్రమే చనిపోతున్నారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. కానీ రిపోర్టుల్లో మాత్రం ఏమీ ఉండటం లేదు. అందుకే అందరికీ భయం కలుగుతోంది. ఒక్కొక్కరుగా కాలనీని వదిలి వెళ్తున్నారు. కాలనీలో ఉన్న ఓ పాడుబడిన భవనంలో దెయ్యం ఉందని అంతా నమ్ముతున్నారు.‘ అని ఆ కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. మంగళవారం నాటికి ఆ కాలనీలో ఉన్న మొత్తం 40 కుటుంబాలు ఖాళీ అవడం గమనార్హం. కాగా, వారికి అవగాహన కల్పించినా, పోలీసులు నచ్చజెప్పినా వినడం లేదని గ్రామ సర్పంచ్ ఎండబట్ల అంజమ్మ చెప్పుకొచ్చారు.