NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలమ్మ కు షాకుల మీద షాకులు!ఆదిలోనే హంసపాదులు!!

Breaking news on YS Sharmila

YS Sharmila: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఆదిలోనే అనేక హంసపాదులు ఎదురవుతున్నాయి.గత రెండు రోజుల్లో సంభవించిన రెండు పరిణామాలు షర్మిల కుఎదురు దెబ్బలుగానే కనిపిస్తున్నాయి.పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ సభ్యులు కొందరు మంగళవారం రాజీనామా చేశారు.ఇక బుధవారం గతంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగిని పరామర్శించడానికి వెళ్లిన షర్మిలకు అతడి ఇంటి తాళం వెక్కిరించింది.మొత్తమ్మీద రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానిపై ఆమెకు ఇప్పుడిప్పుడే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

Shock upon shock to YS Sharmila!
Shock upon shock to YS Sharmila!

మహబూబ్‌నగర్ జిల్లా నేత రాజీనామా!

జూలై ఎనిమిదివ తేదీన ఆమె పార్టీని స్థాపించబోతున్న నేపధ్యంలో అంతకు ముందుగా సంస్ధాగత నిర్మాణం కోసం అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్‌హాక్ కమీటీలో ఉన్న కొందరు వైఎస్సార్ అభిమానులు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదేబాటలో మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సూర్యాపేట జిల్లాలో ఇంకో షాక్!

ఇక ముందుగానే ప్రకటించి షర్మిల బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చారు.ఉద్యోగం రాలేదని నిరాశ నిస్పృహలతో ఆ జిల్లాలోని నేరేడుచ‌ర్ల మండ‌లం మేడారం గ్రామానికి చెందిన యువ‌కుడు నీల‌కంఠం సాయి ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన తెలిసిందే. అతడ్ని పరామర్శించి మనో ధైర్యం నింపడానికి షర్మిల పనిగట్టుకుని సూర్యాపేట పర్యటన పెట్టుకున్నారు.మంగళవారమే ఈ పర్యటన గురించి ఆమె పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.బుధవారం అంగరంగవైభవంగా కదిలి ఆ గ్రామం చేరుకున్నారు.అప్పుడే అసలైన ట్విస్ట్ ఆమెకు మతి పోయేలా చేసింది.ఆమె వెళ్ళేసరికి నీలకంఠం సాయి ఇంటికి తాళం వేసి ఉంది.దీంతో ష‌ర్మిల ఆశ్చ‌ర్య‌పోయారు. హైద‌రాబాద్ నుంచి ప‌రామ‌ర్శించ‌డానికి వ‌స్తే ఇంటికి తాళం వేసి క‌నిపించ‌డంతో ఒకింత షాక్‌కు గుర‌య్యారు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంపై చుట్టుప‌క్క‌ల వారిని ష‌ర్మిల అనుచ‌రులు ఆరా తీశారు.ష‌ర్మిల వ‌స్తున్న విష‌యం తెలుసుకున్న టీఆర్ఎస్ నేత‌లు, పోలీసులు నిన్న రాత్రి నీలకంఠ సాయి ఇంటికొచ్చి ఇంట్లో లేకుండా వెళ్లిపోవాలని ఆదేశించిన‌ట్టు వారు స‌మాచారం సేకరించారు. దీంతో తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో ష‌ర్మిల కాసేపు మాట్లాడి కారెక్కేశారు.ఈ ఉదంతం తెలంగాణాలో వైరల్ టాపిక్ గా మారింది.

 

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju