Eatela rajendar: టీఆర్ఎస్ సీనియర్ నేత అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. తెలంగాణలో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రస్తుతం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఉప ఎన్నికకు ఇప్పటికే ఈటల సిద్ధమైపోయారు. నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈటలకు అసలు సమస్య ఎన్నిక కంటే మరొకటి ఉందంటున్నారు.
Read More: Eatela Rajendar: ఈటల విషయంలో తేడా రాకుండా చూస్తున్న బీజేపీ
ఈటల తిరుగులేని నేత..
దాదాపు 2 దశబ్దాల పాటు హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఈటల రాజేందర్ గుర్తింపు పొందారు. ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం, కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు సరన నిలబడిన నేతగా ఎదిగారు. అలాంటి వ్యక్తి పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తరఫున ఆయనే బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అంతటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీలో కుంపట్లు మొదలయ్యాయని అంటున్నారు.
Read More: Eatela Rajendar: కొత్త గేమ్ మొదలుపెట్టిన ఈటల… వర్కవుట్ అవుతుందా?
ఆ నేత షాకివ్వడం ఖాయమంటున్నారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్న ప్రచారం మొదలైనప్పటి నుంచి అంతర్గత అసంతృప్తిలో ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ నేత పెద్దిరెడ్డి ఆ పార్టీని వీడనున్నట్లు చెప్తున్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిక గురించి తనకు మాట మాత్రంగానైనా పార్టీ పెద్దలు చెప్పలేదని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల రాక నుంచి బీజేపీతో పెద్దిరెడ్డి అంటీముట్టనట్టు ఉంటున్నారు. త్వరలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే ఈటలకు అసలైన షాక్ అంటున్నారు.