Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఊహించని షాకులు ఎదుర్కుంటున్నారు. పీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆయనకు పార్టీ సీనియర్ల నుంచే షాకులు తగులుతున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో ఎవరిని నిలబెట్టాలా అనే అంశంపై కాంగ్రెస్లో చర్చ మొదలైంది. బీజేపీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో విజయావకాశాలు ఉన్న నేతల గురించి చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందిరా భవన్లో సమావేశమయ్యారు.
Read More: Revanth Reddy: రాహుల్తో కలిసి తన రేంజ్ ఏంటో చూపించనున్న రేవంత్
ఆ ఇద్దరు నేతలు…
తొలిసారి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా హుజురాబాద్ ఉప ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన బాధ్యులు కూడా హాజరయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన హుజురాబాద్ ఉప ఎన్నికల సమీక్షా సమావేశానికి కూడా ఇద్దరు ముఖ్య నేతలు డుమ్మా కొట్టడంతో మరోసారి కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో పార్టీ అవలంభించాల్సిన వ్యూహంపై జరుగుతున్న సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడంపై కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read More: KCR: కేసీఆర్ ఆశలన్నీ అడియాసలు చేసేసిన కేంద్రం
ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే కలిసి…
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ లుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు హాజరు కాలేదు. పీసీసీ చీఫ్గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి దూరంగానే ఉన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఈ సమావేశానికి మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.