Vijaya Sai Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు తరచు విమర్శలు, ఆరోపణలు చేస్తూ తీవ్రంగా ఇరుకున పెడుతున్న విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపి విజయసాయి రెడ్డి ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు రఘురామకృష్ణం రాజు. అంతే కాకుండా ఆగస్టు 25 ఏదో జరగనున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజుపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తన దైన శైలిలో పరోక్షంగా విమర్శలు చేశారు.
“తాడు బొంగరం లేదు, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు. యూరో బేరగాడు యూరప్ కే పోతాడా? నియోజకవర్గంకి వస్తే జనం చెప్పులతో స్వాగతం చెప్తారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ” అంటూ విజయసాయిరెడ్డి రఘురామను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. రఘురామ సంస్థలపై బ్యాంకు అధికారుల ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని, ఆయన పేరును నేరుగా ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి ఈ విధంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై రఘురామ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.