Mother tortured son: భర్త మీద కోపంతో కన్న బిడ్డపై ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు మాతృత్వానికే మాయని మచ్చగా మిగులుతోంది. చిన్నారిపై కన్న తల్లి దాటీష్టంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ దృశ్యాలను చూపరుల హృదయాలను కలచివేస్తున్నాయి.
విషయంలోకి వెళితే…చిత్తూరు జిల్లా సోమల మండలం రాంపల్లికి చెందిన తులసికి తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాకు చెందిన వడివేలన్ తో వివాహం అయ్యింది. అయితే భార్య, భర్తల మధ్య విబేధాలు రావడంతో తులసి అనిపల్లిలో కుమారుడితో కలిసి తన తండ్రి వద్ద ఉంటోంది. తులసి భర్త తమిళనాడులోనే ఉంటున్నాడు. భర్త మీద కోపంతో చిన్నారి ప్రదప్ ను చిత్రహింసలకు గురి చేసింది. వంటి మీద వాతలు తేలేలా, పళ్లు ఊడిపోయేలా తులసి చావ బాదింది. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఇంత దారుణానికి పాల్పడటమే కాక చిన్నారిని కొడుతున్న దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి భర్తకు వాట్సాప్ ద్వారా పంపింది.
తన కుమారుడిని భార్య శాడిస్ట్ గా హింసించడం చూసిన భర్త వడివేలన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోలను పోలీసులకు చూపించారు. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Read More:
YS Vijayamma: విజయమ్మ ఏం చేయబోతున్నారు..? ఆ మంత్రులకు ఆహ్వానం..!!
AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!