BREAKING: పారాలింపిక్స్ లో మరొక పతకం భారత్ ఖాతాలో పడింది. జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్లో సుమిత్ ఆంటిల్ అద్భుత విజయం సాధించాడు. 68.55 మీటర్లు ఈటెను విసిరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మొదటి స్థానంలో నిలిచిన అతనికి స్వర్ణ పతకం దక్కింది. దాంతో ఈ టోక్యో ఒలంపిక్స్ లో మొత్తం రెండు స్వర్ణ పతకాలు భారత్ ఖాతాలో చేరిపోయాయి. పారాలింపిక్స్లో ఈ రోజు భారత క్రీడా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ మన అథ్లెట్లు పారాలింపిక్స్లో అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరుస్తున్నారని పొగిడారు. పారాలింపిక్స్లో సుమిత్ ఆంటిల్ రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శనకు దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ సాధించినందుకు సుమిత్కు అభినందనలు తెలిపారు. స్వర్ణ పతకం భారత్ కి రావడంతో ప్రస్తుతం దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది.