NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Telugu States: తెలుగు రాష్ట్రాల సీఎంలకు బీజేపీ పరీక్ష ..!

Telugu States: కొద్ది నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ లీటరు వంద రూపాయలు దాడి పోయింది. ప్రధానంగా డీజిల్ ధర పెరగడంతో రవాణా రంగంపై ఆధారపడి ఉన్న అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ మెట్టు దిగింది. సామాన్యులకు ఊరట కల్గించేందుకు కేంద్రం దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నిన్న కేంద్రం ఈ శుభా వార్త అందించడంతో సామాన్యులకు కాస్త ఊరట కల్గింది.

Telugu States facing petrol price issue
Telugu States facing petrol price issue

Read More: BJP: తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధిగా ఈటల ..?

Telugu States:  ఇక రాష్ట్రాల వంతు..

లీటరు పెట్రోల్ పై రూ.5 లు, లీటరు డీజిల్ పై రూ.10లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు దీపాపళి పండుగ రోజైన గురువారం నుండే అమలులోకి తీసుకువచ్చింది. కేంద్రంఏక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తే లీటరు పెట్రోల్, డీజిల్ వంద రూపాయల లోపుగా అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు స్పందించాయి. అస్సోం, త్రిపుర, గోవా, మణిపూర్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై రూ.7 ల వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్ లీటరు పై రూ.12, డీజిల్ లీటరు పై రూ.17 లు తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయల లోపుకు వచ్చేశాయి.

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఒత్తిడి

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించిన విషయాన్ని తెలియజేస్తూ ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఏపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఈ మేరకు సీఎంలు వైఎస్ జగన్, కేసిఆర్ లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రెండు ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఏపి పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నేతల డిమాండ్ కు తలొగ్గి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అయితే కేంద్రం ఏదో విధంగా నిధులను సమకూర్చే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలకు కేంద్రం అంతగా చేయూతను అందించే అవకాశం ఉండదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా వ్యాట్ తగ్గించకపోతే ప్రజల నుండి వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వస్తుంది. వ్యాట్ తగ్గిస్తే పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పరీక్ష నుండి ఎలా గట్టేక్కుతారో చూడాలి మరి.,

 

 

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju