NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా కీలక వ్యాఖ్యలు..! రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం..!!

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. విశాఖపట్నం పాయకరావుపేట నియోజకవర్గం గుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు హజరైయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వాస్తవానికి కాపులు ఏ రాజకీయ పార్టీకి కాపు కాస్తే ఆ రాజకీయ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ టీడీపీకి దూరం అయ్యింది. అయితే జనసేనకు మద్దతు ఇస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ టీడీపీకే సహకరిస్తారని ప్రచారం జరగడంతో మెజార్టీ కాపు సామాజిక వర్గ నేతలు 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపు కాశారు. అయితే గత కొంత కాలంగా రాజకీయాలకు అతీతంగా కాపు సామాజిక వర్గ నేతలు సంఘటితం అవుతున్నారు. సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Ganta Srinivasa Rao sensational comments
Ganta Srinivasa Rao sensational comments

 

Ganta Srinivasa Rao: కాపు సామాజిక వర్గమే రాజకీయాలను శాసిస్తుంది

నిన్న వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలోనూ రాజకీయాలకు అతీతంగా ఆ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు. జనసేన నాయకుడు బుజ్జి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి గంటాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ధర్మశ్రీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలు వేరైనా సామాజిక వర్గ సమస్యల విషయంలో సంఘటితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గమే రాజకీయాలను శాసిస్తుంది వ్యాఖ్యానించారు. ఏపిలో రాబోయే రోజుల్లో కాపులు ఏకమవ్వాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాపులే కీలకం కానున్నారని గంటా అన్నారు. కాపుల బలోపేతానికి ఎప్పుడూ కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా అన్నారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల కాపు నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని వార్తలు వచ్చాయి. దివంగత వంగవీటి మోహనరంగా పేద వర్గాల కోసం కృషిని కొనియాడిన ఎమ్మెల్యే ధర్మశ్రీ … ఏపిలో రెండు లక్షలకు పైగా వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఉన్నాయన్నారు. దేశంలో అంబేద్కర్ విక్రయాల తరువాత ఆ స్థాయిలో విగ్రహాలు ఉన్నాయి అంటే అవి కేవలం వంగవీటి మోహనరాంగా విగ్రహాలే అని కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు.

ఒక కులంతో రాజకీయం చేద్దామంటే సాధ్యం కాదు

కాగా గంటా వ్యాఖ్యలకు భిన్నంగా తోట త్రిమూర్తులు మాట్లాడారు. సామాజిక వర్గ సమస్య ఏదైనా వస్తే అందరం కలిసి పని చేయాలన్నది తమ ఉద్దేశమన్నారు. “పార్టీలు వేరు,. కులం వేరు. రాజకీయ పార్టీలో మాకు నచ్చిన పార్టీలో మా అవసరాల కోసమో లేకపోతే మాకు నచ్చిన పార్టీ సిద్ధాంతాల కోసం ఏ పార్టీలోనైనా ఉంటాం. కానీ సామాజికవర్గానికి సంబందించిన సమస్య ఏదైనా వస్తే అందరం కలిసి పని చేయాలనే” తాను చెప్పాను. ఒక కులంతో రాజకీయం చేద్దామంటే ఎప్పుడూ సాధ్యం కాదు. దీనికి గత అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సామాజికవర్గం కోసం పని చేయకుండా ఓట్ల కోసమే వచ్చే వాళ్లను గుర్తించరు అని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju