Wipro: దేశ అత్యున్నత ఐటీ కంపెనీ విప్రో(Wipro) లో జాబ్ నోటిఫికేషన్ లో రిలీజ్ అయ్యాయి. 60%.. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి… 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ లో భాగంగా 2020, 2021, 2022లో పూర్తి చేసిన వారి నుండి అలాగే పూర్తి చేయనున్న.. విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ క్రమంలో అప్లికేషన్ చివరి తేదీ జనవరి 31 వ తారీకు.. అని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక ఇదే సమయంలో 25 సంవత్సరాల వయస్సు పరిమితిని విధించడంతో పాటు ప్రాజెక్టు ఇంజినీరింగ్ పోస్టుకు సంవత్సరానికి రూ.3.5 లక్షల వేతనం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
బీఈ/బీటెక్ (కంప్యూటర్ డిగ్రీ), ఎంఈ/ఎంటెక్ (5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజినీరింగ్, అగ్రి కల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మినహా ఇంజినీరింగ్లో అన్ని బ్రాంచ్ల వారికి అర్హత కల్పించింది. 2022లో కోర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ నోటిఫికేషన్ కి పెట్టే వాళ్ళు 12వ తరగతిలో.. 60 శాతం కంటే ఎక్కువ మార్కులు ఉండాలని షరతు విధించింది. ఇక ఇదే తరుణంలో గడిచిన ఆరు నెలల్లో విప్రో కి.. పలు విధాలుగా.. సెలక్షన్ పద్ధతిలో దరఖాస్తులు చేసుకున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ అనర్హులని జాబ్ నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఇక ఇదే తరుణంలో నేపాల్(Nepal), భూటాన్(Bhuttan) దేశానికి చెందిన వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ పౌరసత్వం పత్రాన్ని పొందుపరచాలని .. విప్రో పేర్కొంది. మహమ్మారి కరోనా(Corona) కారణంగా దేశ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో దేశ ఐటి దిగ్గజం విప్రో విడుదల చేసిన నోటిఫికేషన్.. నిరుద్యోగులకి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లయింది. ప్యాకేజీ కూడా బాగా ఇవ్వడానికి విప్రో ముందుకువస్తూ ఉండటంతో ..నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో అప్లై చేస్తున్నారు.