Nagarjuna: టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ నాగ చైతన్య, సమంతలు ఇటీవలె తమ వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమలో ముగిని తేలిన ఈ జంట.. ఆ తర్వాత 2017లో పెద్దలను ఒప్పించి గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే విడాకులు ప్రకటించి.. ఎవరి దారి వారు చూసుకున్నారు.
వీరి బ్రేకప్ మ్యాటర్ అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఎంతలా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇకపోతే తాజాగా చై-సామ్ల విడాకులపై కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత విడాకుల ప్రస్తావన రాగా.. నాగ్ స్పందిస్తూ ` వారు విడిపోయినా పర్వాలేదు. అది వారి వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న పరస్పర నిర్ణయం. ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషిస్తాను. అలాగే వారిద్దరి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను` అంటూ పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు నాగార్జున కామెంట్స్ సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!