Radhey Shyam: వాలెంటైన్స్ డే ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ సినిమాలకు సంబంధించి సరికొత్త లుక్ లు… పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించిన సినిమా పోస్టర్లు ఈరోజు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన వాటిలో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యాం సినిమా గ్లింప్స్ కూడా విడుదల కావడం జరిగింది. ప్రేమకథా నేపథ్యంలో… రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వేసవి కానుకగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.
ఫస్ట్ టైం ప్రభాస్ పక్కన పూజా హెగ్డే నటిస్తూ ఉండటంతో అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. “వాలెంటైన్స్ డే” సందర్భంగా తాజాగా రిలీజ్ అయిన “రాధేశ్యాం” సినిమా గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా వీడియో బట్టి చూస్తే పూజా హెగ్డే అదేవిధంగా ప్రభాస్ ఒకే హాస్పిటల్ లో పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. వీడియో ప్రారంభంలో.. పూజా హెగ్డే తో ప్రభాస్ మాట్లాడాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య.. సన్నివేశాలు చివరిలో విక్రమాదిత్య కి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు అంటూ పూజా హెగ్డే ప్రశ్నించడంతో వీడియో ముగిసింది.
ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11 వ తారీకు రాదే శ్యాం సినిమా రిలీజ్ చేస్తున్నట్లు.. సినిమా యూనిట్ వీడియోలో క్లారిటీ ఇచ్చింది. పాతకాలంనాటి ప్రేమకథా నేపథ్యంలో.. ఈ సినిమా స్టోరీ తెరకెక్కడం జరిగిందట. ఈ సినిమాలో ప్రభాస్ కి కొన్ని అతీత శక్తులు ఉంటాయి అని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సింది. ఆ సమయంలో కరోనా కేసులు పెరగటంతో… వాయిదా పడి మార్చి 11వ తారీఖు ఇప్పుడు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.