Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాదులో అభిమానుల మధ్య భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ నందు జరిగిన ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేటీఆర్ తాను ఒక రాజకీయ నాయకుడిగా మంత్రిగా కాకుండా సోదరుడిగా బీమ్లా నాయక్ ఈ వేడుకకు హాజరైనట్లు హైలెట్ ప్రసంగం చేశారు.
అయితే అంతా బాగానే ఉన్నా గాని సినిమా కి వెన్నెముక లాంటి వ్యక్తి త్రివిక్రమ్ వేడుకలో చివరిలో కనబడి.. అసలు స్పీచ్ ఇవ్వకపోవటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమాకి మాటలు డైలాగులు రాయడం మాత్రమే కాకుండా ఒక పాట కూడా రాసిన త్రివిక్రమ్… సినిమాకి అంతా తానే అయి ఉండి అసలు రిలీజ్ వేడుకలో మైక్ ఎందుకు పట్టుకోలేదని చాలామంది రకరకాలుగా డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఇ సినిమా ప్రాజెక్టు విషయంలో సాగర్ కే చంద్ర ఆటలో అరటిపండు మాదిరిగా.. ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రెడిట్ మొత్తం తన కి రాకుండా దర్శకుడికి రావాలని త్రివిక్రమ్ స్పీచ్ ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు.
మరికొంతమంది నిర్మాత బండ్ల గణేష్ ఆడియో వలన గురూజీ ఏమీ మాట్లాడ దలుచుకోలేదు అని ఇక అదే సమయంలో బండ్ల అన్న బండ్ల అన్న… అరుపులు కూడా అభిమానుల నుండి రావడంతో ఇటువంటి సమయంలో మాట్లాడటం అంత మంచిది కాదని మాటల మాంత్రికుడు సైలెంట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడే త్రివిక్రమ్…బీమ్లా నాయక్ త్రీ రిలీజ్ వేడుకలో ఉన్నాగానీ మాట్లాడకపోవడం.. అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.