Raviteja: మాస్ మహారాజ రవితేజ మాంచి దూకుడు మీదున్నాడు. క్రాక్ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటికే అరడజను సినిమాలను లైనప్ చేసుకున్నాడు. వాటిలో మల్టీస్టారర్ సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్ మహారాజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియన్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా లాంఛింగ్ జరిగింది. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్
మీదకు వచ్చింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.
భారీ పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన కృతి సనన్ సోదరి నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అయితే, ఈ సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. స్టూవర్డుపురం దొంగగా పాపులర్ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని అదే టైటిల్తో పాన్ ఇండియా సినిమాగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.
Raviteja: ఈ క్లైమాక్స్ మన ప్రేక్షకులను నచ్చుతుందా..?
ఇక ఈ సినిమా రవితేజ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. ఆయన బాడీ లాంగ్వేజ్కు సరిగ్గా సరిపోయే కథ ఇది. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. ఇందులో రవితేజ పాత్ర తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేసేలా ఉంటుంది. ఒరిజినల్ పాత్రను యథావిధంగా చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఎన్నో ఆసక్తికర మైన చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే జీవిత కథలో ‘టైగర్ నాగేశ్వరరావు’ను ఉరితీశారు. అలాగే, చిత్ర క్లైమాక్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ క్లైమాక్స్ మన ప్రేక్షకులను నచ్చుతుందా లేదా అనేది చూడాలి.