NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Jai Bhim Bharat: ఏపిలో ఆవిర్భవించిన మరో కొత్త రాజకీయ పార్టీ

Jai Bhim Bharat: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బడుగు బలహీన వర్గాలను కలుపుకుని ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం సమావేశాలు నిర్వహించారు. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరో పక్క రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆనందయ్య కూడా బీసీల పార్టీల పెడుతున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశాల్లో వెల్లడించారు. ఆ సంఘ నేతలతో ఒకటి రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు. కానీ ఈ పార్టీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే చాలా కాలంగా టీవీ టిబేట్ లలో పాల్గొనడంతో పాటు జై భమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ను నిర్వహించారు. అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14న) రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని నెల రోజుల క్రితమే శ్రవణ్ కుమార్ చెప్పారు. చెప్పినట్లుగానే జై భీమ్ భారత్ పార్టీ ఆవిర్భావ సభ గురువారం విజయవాడలో నిర్వహించారు.

Jai Bhim Bharat party formation in ap
Jai Bhim Bharat party formation in ap

 

Jai Bhim Bharat: దళితుల కోసం పోరాడే పార్టీ లేదు

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందన్నారు. తాను 28 సంవత్సరాలకే న్యాయమూర్తిని అయ్యాననీ, ఆ పదవిని పదేళ్లకే వదిలి వచ్చానని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తూ ఆయిల్ ప్యాకెట్ రూ.200లకు విక్రయించే పార్టీలను పొగుడుదామా అని ప్రశ్నించారు శ్రావణ్ కుమార్. దళిత బిడ్డలకు మేన మామ అని చెప్పిన సీఎం జగన్ .. ఆ తర్వాత చేసిన అన్యాయం ఎవరూ మర్చిపోరని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ

వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీ పెడతామని తెలిపారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తానని తెలిపారు. 26 రకాల దళిత స్కీమ్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు శ్రావణ్ కుమార్. విదేశీ విద్య కోసం వెళ్లే వారు ప్రభుత్వం నుండి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కన్షీరామ్ మాటల స్పూర్తితో ఈ రాజకీయ పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రితో సబ్ ప్లాన్ పై ఎక్కడైనా చర్చిస్తానని సవాల్ విసిరారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju