Acharya: దాదాపు రెండేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`తో ప్రేక్షకులను అలరించే సిద్ధంగా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రను పోషించారు.
అలాగే పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 29 అంటే మరి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతోంది. ఆచార్య స్టార్ కాస్ట్ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకోగా.. మెగా ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద హంగామా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాని ప్రకారం.. ఆచార్య బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలిస్తే మైండ్బ్లాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే, ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అవును, ఆచార్య ప్రపంచవ్యాప్తంగా రూ. 131 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక ఏరియా వైజ్ గా ఆచార్య థియేట్రికల్ హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే..
నైజాం: 36 కోట్లు
సీడెడ్: 20 కోట్లు
ఉత్తరాంధ్ర:13.5 కోట్లు
గుంటూరు: 9.5 కోట్లు
ఈస్ట్: 9.5 కోట్లు
వెస్ట్: 8 కోట్లు
కృష్ణ: 8 కోట్లు
నెల్లూరు: 4.5 కోట్లు
————————
ఏపీ+తెలంగాణ=109 కోట్లు
————————
రెస్ట్ ఆప్ ఇండియా: 11 కోట్లు
ఓవర్సీస్: 11 కోట్లు
————————–
వరల్డ్ వైడ్ గా టోటల్ బిజినెస్= రూ. 131 కోట్లు
————————–
కాగా, సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఆచార్య సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.132.50 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది. మరి చిరు-చరణ్ లు ఈ భారీ టార్గెట్ ను అందుకుంటారో..లేదో.. చూడాలి.